+91 95819 05907

పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి

పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి

సిపిఐ(ఎం) నాయకురాలు గుడిమెట్ల రజిత.

శ్మశాన వాటికను సందర్శించిన సిపిఐ(ఎం) బృందం.

నేటి గదర్, న్యూస్, వైరా:-
పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, హనుమాన్ బజార్ బీసీలకు స్మశాన వాటిక రహదారి సమస్య ఎట్టకేలకు పరిష్కారం అయిందని సిపిఐ(ఎం) వైరా పట్టణ నాయకురాలు గుడిమెట్ల రజిత అన్నారు. శుక్రవారం సిపిఐ(ఎం) బృందం వైరా మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ బజార్ శ్మశాన వాటికను సందర్శించారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా హనుమాన్ బజార్ స్మశాన వాటికకు రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేద కుటుంబాలలో ఎవరైనా మరణిస్తే చందాలు వేసుకొని రహదారిని బాగు చేసుకుని దహన సంస్కారాలు చేస్తున్నారన్నారు. అనేక సంవత్సరాలుగా దశల వారి ఆందోళనలో భాగంగా హనుమాన్ బజార్ స్మశాన వాటికకు దారిని ప్రభుత్వాధికారులు వేయడం జరిగిందని తెలిపారు. భూములకు విలువ పెరుగుతున్నా కొద్దీ ప్రజల్లో స్వార్థం పెరుగుతుందని, గుండ్రాతి మడుగు రెవెన్యూ పరిధిలో వైరా చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురికాకుండా అదికారులు కాపాడాలని అన్నారు. 2015 సంవత్సరం నుండి అనేక దఫాలుగా చెరువు చుట్టూ ఉన్న శిఖం భుములను ఆక్రమణకు గురికాకుండా చూడాలని సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణ గురికావడం వల్ల ప్రజా అవసరాలకు ప్రభుత్వ భూములు లేకుండా పోయాయని అన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ల లతో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలని, ఇప్పటికైనా హనుమాన్ బజారుకు స్మశాన వాటికకు పర్మినెంట్ సిసి రోడ్డు నిర్మాణం చేయాలని, స్మశాన వాటికకు హద్దులు ఏర్పాటు చేయాలని అన్నారు. అవి సాధించేంత వరకు సిపిఐ(ఎం) పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) పార్టీ వైరా శాఖ కార్యదర్శి ఓర్సు సీతారాములు, సభ్యులు దేవళ్ళ కృష్ణ, బత్తుల ప్రమీల, వల్లేపు ఏడుకొండలు, దేవళ్ళ మంగ, ఉప్పు భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !