నేటి గదర్ న్యూస్, వైరా:-
వ్యవసాయ మార్కెట్లతో పాటు అన్ని మండల కేంద్రాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు సీసీఐ ని వెంటనే ఏర్పాటు చేయాలని సిపి(ఐ)ఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అకాల వర్షంతో ఒకవైపున రైతు తీవ్రంగా నష్టపోయి చేతికి వచ్చిన పత్తి పంట అమ్ముకోవడానికి సరైన ధర లేక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని వెంటనే ప్రభుత్వం సంబంధించిన అధికారుల స్పందించి పత్తి కొనుగోలు కేంద్రం సిసిఐ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని మాటలకే పరిమితమై కాలయాపన చేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని గుర్తు చేశారు, ప్రభుత్వాలు సకాలం స్పందించకపోతే రైతులతో పాటు అన్ని రైతు సంఘాలతో కలిపి తీవ్ర ఆందోళన పోరాటాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని ఆయన వైరాలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.









