రిజర్వేషన్లు బిల్లును రాజకీయ కోణంలో చూస్తున్న బిజెపి:- బొంతు రాంబాబు
వైరా లో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన సిపిఎం శ్రేణులు
నేటి గదర్ న్యూస్, వైరా:
సిపిఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ బీసీలకు 42 %శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు నిచ్చింది భాగంగా వైరా స్థానిక రింగ్ రోడ్డు సెంటర్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కుల గనణ చేసి 57% గా ఉన్న బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు ఉండాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కు జీవో నెంబర్ 9 ని పంపించి మూడు నెలల కాలం అవుతున్న కాలయాపన చేస్తూ న్నారు దీనివలన స్థానిక సంస్థల ఎన్నికలు ఆగి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆటంకంగా ఉంది అన్నారు ఇప్పటికైనా జీవో నెంబర్ 9 ని ఆమోదించి స్థానిక సంస్థలకు గ్రామపంచాయతీ లకు కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన నిధులను మంజూరు చేసి గ్రామపంచాయతిల్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ ,వైరా డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యురాలు మచ్చా మణి , డివిజన్ కమిటీ సభ్యులు తూము సుధాకర్, తోట నాగేశ్వరరావు,వైరా రూరల్ మండల నాయకులు బాజోజి రమణ, పట్టణ నాయకులు కొంగర సుధాకర్, పైడిపల్లి సాంబశివరావు ,పారుపల్లి కృష్ణారావు, మల్లేంపాటి రామారావు, కామినేని రవి, చింతనిప్పు నర్సింహారావు, తోట కృష్ణవేణి కాంసాని మల్లికాంబ సంక్రాంతి పురుషోత్తరావు ఎస్ కే మజీద్
మాడపాటి మల్లికార్జున్ సంక్రాంతి వినయ్ బాబు,అమరనేని కృష్ణ, మైకేల్ ,వడ్లమూడి మధు , వేల్పుల మైఖేల్
పాసంగులపాటి చలపతి, గోరంట్ల మురళి తదితరులు పాల్గొన్నారు.









