పినపాక, అక్టోబర్ 18:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన జానంపేట పంచాయతీ కొత్తగుంపు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పానుగంటి నర్సిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజున ఆర్థిక సహాయం అందించింది.
పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు, దశదినకర్మల కోసం నర్సిరెడ్డి కుటుంబానికి బియ్యం వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మృతుని కుమారుడు పిచ్చి రెడ్డిని పరామర్శించి, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో పేరం వెంకటేశ్వర్లు, దాట్ల రాజేష్, సాయి సురేష్, పోలిశెట్టి హరీష్, సుతారపు వీరన్న, జరుపుల రాము, పొనుగోడు చందర్ రావు, పడాల రాము, అత్తే లక్ష్మీనారాయణ, బిక్కం నరసింహారావు, కబ్బాకు రమేష్, సింహాద్రి మనోజ్, దగ్గర నరేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.









