*42 శాతం బిసి రిజర్వేషన్ అమలుచెయ్యాలని బంద్ కు అన్ని పార్టీ ల మద్దతు*
నేటి గదర్ కరకగూడెం: బిసీలు అందరూ ఐక్యతతో ఉండి మన హక్కులను సాధించుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగాలని మండల బిసిల నాయకులు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చేపట్టిన బంద్ లో భాగంగా మండల వ్యాప్తంగా విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, వాహనాలును నిలిపివేసి బంద్ ను విజయవంతం చేశారు. ఈ బీసీ బంద్ కు అన్ని పార్టీల మద్దతు తెలియజేయడం శుభపరిణామం అని మండల బీసీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రం నుంచి బట్టుపల్లి పంచాయతీ పరిధిలోని వీరాపురం క్రాస్ వద్ద కు భారీ ర్యాలీగా వచ్చి అనంతరం కరకగూడెం ప్రధాన కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీల నాయకులు ఈ బీసీ బంద్ లో పాల్గొన్నారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల హక్కులను సాధిద్దాం అంటూ నినాదాలు చేస్తూ గ్రామలలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం చేసే విధంగా 42 శాతం రిజర్వేషన్ ను వెంటనే ఆమోదించాలని వరు కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సిపిఎం పార్టీ నాయకులు సిపిఐ పార్టీ నాయకులు బీసీ సంఘాల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉపసర్పంచులు సర్పంచులు యువజన నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు .









