చింతకాని మండలంలో కేంద్రంలో, బీసీ రిజర్వేషన్ 42 % అమలు చేయాలని డిమాండ్ చేస్తూ—కాంగ్రెస్,బిజెపి, తెలుగుదేశం, సిపిఐ,సిపిఎం
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
ఖమ్మం జిల్లా చింతకాని మండలం చింతకాని మండల కేంద్రంలో బీసీ రిజర్వేషన్లు 42 % పెంచాలంటూ కాంగ్రెస్, బిజెపి,తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం,వివిధ పార్టీలు మండల హెడ్ క్వార్టర్లలో షాపులు మరియు స్కూల్స్ వివిధ పార్టీల ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంధు నిర్వహించారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు& మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బీసీలకు స్థానికసంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ 42% రిజర్వేషన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే బిజెపి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని ఆయన మండిపడ్డారు. మరియుసిపిఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు మాట్లాడుతు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతంతో రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభాలో సగం భాగం బీసీ జనాభా 56.3 శాతం మంది ఉన్నారు అలాంటి బీసీలకు అన్యాయం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మొండివైఖరితో బీసీ బిల్లు అమలు కాకుండా అడ్డుపడుతున్నది తక్షణమే రాష్ట్ర గవర్నర్ బీసీ బిల్ ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే 9వ షెడ్యూల్ పొందుపరిచి రాష్ట్రపతితో ఆమోదంతో రాష్ట్ర గవర్నర్తో బీసీ బిల్లు అమలు చేయించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు మరియు బిజెపి మండల అధ్యక్షులు మాట్లాడుతూబీసీలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే స్థానిక ఎలక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి రెండు సంవత్సరాలు గడుస్తున్న కూడా 42% రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమయ్యారని, తక్షణమే 42% రిజర్వేషన్లు బీసీలుకు అమలు చేసి, ఎలక్షన్ నిర్వహించాలని బిజెపి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు డిమాండ్ చేశారు.









