*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే*
బీసీలు చేపట్టిన ధర్నాకు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకుల సంఘీభావం.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి(భూపాల్ మాదిగ) సెప్టెంబర్ 18.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిసి రిజర్వేషన్ సాధన కోసం అఖిలపక్షం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బందుకు విశేష స్పందన లభించింది. మాసాయిపేట మండల కేంద్రంలో అఖిలపక్షం బీసీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. బీసీల రాస్తారోకోతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు చేసిన అనంతరమై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, మాల మహానాడు నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు మరియు రాజకీయ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల నుండి నాయకులు పాల్గొన్నారు.









