+91 95819 05907

వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్ట పరివారం ఇవ్వాలి

సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ :

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మండలంలో సాగుచేసిన పంటలైన పెసర,మినుము ప్రత్తి, వరి పంటలు గత నెల రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని పంట నష్టం జరిగిన ప్రతి పంటకు ప్రతి ఎకరాకు 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
వైరా సిపిఎం ఆఫీస్ బోడెపుడి భవనం నందు వైరా రూరల్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ముఖ్యుల సమావేశం సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగింది ఈ సమావేశంలో భూక్యా వీరభద్రం పాల్గొని మాట్లాడుతూ మండలంలో రైతులు వేసిన పంటలు పెసర మినుము పంటలో వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని అదేవిధంగా ప్రతి పంటకు వైరస్ కి ప్రతి దిగుబడులు రాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అరకొరగా వచ్చిన ప్రతి ఇప్పుడు దేశ తీసే దశలో ఉందని గత నెలలో నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రతి పంటకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బావు లు, బొర్ల కింద వేసిన వరి పంట కోత దశలోకి వచ్చిందని వర్షాలకు వరి పంట కూడా నష్టం జరిగింది అని అన్నారు. దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దెబ్బతిన్న పంటలకు నష్ట పరివారం వెంటనే ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వని పక్షంలో రైతులను సమీకరించి సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్,సిపిఎం వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు,మండల కమిటీ సభ్యులు సుధాకర్, కిలారి శ్రీనివాసరావు మేడా షరాబంది, బాజోజు రమణ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !