.
సీపీఎం పార్టీ జిల్లా కమిటి సభ్యులు దివ్వెల వీరయ్య
నేటి గదర్ న్యూస్, 23/10/2025, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఎర్రుపాలెం మండలంలోని గుంటుపల్లి గోపవరం,కొత్త గోపవరం గ్రామలలో పత్తి,మిర్చి, వారి పంట పొలాలను సిపిఎం పార్టీ బృందం పరిశీలించారు. రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న *సీపీయం పార్టీ జిల్లా కమిటి సభ్యులు దివ్వెల వీరయ్య* మాట్లాడుతూ గతంలో నీటి కొరతతో, ఇప్పుడు ఆకల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించే ఏ పంటకు ఈ అకాల వర్షాల వల్ల దిగుబడి వచ్చే పరిస్థితి లేదని వ్యవసాయ శాఖ ఇతర శాఖలతో పంటల సర్వే చేసి ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారం కింద ఇవ్వాలని గతంలో కొనుగోలు చేసిన ఒడ్లు బోనస్ ఇంకా పడక రైతులు ఇబ్బంది పడుతున్నారని వెంటనే ఆ బోనస్ ని రైతు ఖాతాలో వేయాలన్నారు. అధిక వర్షాలు అకాల వర్షాలు అతివృష్టి కారణంగా రైతు పండించే అన్ని రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతుల ఆత్మహత్యలు నివారించాలంటే మధిర నియోజకవర్గన్ని కరువు నియోజకవర్గంగా ప్రకటించి రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు, నల్లమోతు హనుమంతరావు, మెడ గాని తిరుపతిరావు, మందడపు ప్రభాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.









