హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ నేటి గదర్ ప్రతినిధి అక్టోబర్ 24.
మెదక్ జిల్లా హావేళ్ళి ఘణపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన కోమ్మట సిద్దిరాములు శుక్రవారం రోజు తెలంగాణ యస్,సి,యస్.టి,కమిషన్ చైర్మన్ ను కలిసి కులం పేరుతో దుషించిన బద్దం యాదవరెడ్డి పై యస్.సి,యస్.టి,కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేశాడు.గతంలో కూడా 2024 లో సంవత్సరంలో కూడా ఇలాగే వినాయకుని కోబ్బరికాయ కోట్టడానికి వేళ్ళితే కులం పేరుతో దూషించి బూతు మాటలు తీట్టారని యస్.సి,యస్.టి, అట్రాసిటీ కేసు పేడితే ఆ కేసును పూర్తిగా దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.మళ్ళీ ఈ నెల 12వ తేదీన రాత్రి బద్దం యాదవరెడ్డి పోయిన సంవత్సరం నాపై కేసు పేట్టారని కులం పేరుతో దూషిస్తు నా భార్య ను మానసికంగా అవమాన పరుస్తు బూతు మాటలు తీట్టాడాని అదే రోజు రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే మెదక్ డియస్పి నేను పేట్టిన అట్రాసిటీ కేసును నమోదు చేయకపోగా మళ్ళీ మాపైనే కేసులు చేశారని యస్.సి,యస్.టి,కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.కాబట్టి పోయిన సంవత్సరం కూడా అట్రాసిటీ కేసు ను నమెదు చేయనందున ఈ సారైనా మాకు న్యాయం చేయాలని ఇప్పుడున డియస్పి కాకుండా మరోక డియస్పి తో పూర్తి స్థాయిలో విచారణ జరిపి నన్ను నా భార్య ను కులం పేరుతో దూషించి బూతు మాటలు తీట్టిన మా గ్రామస్తుడైన బద్దం యాదవరెడ్డి పై యస్.సి,యస్.టి, అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ పంపిచాలాని అలాగే మాపై దౌర్జన్యంగా పేట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఫిర్యాదు దారుడు కోమ్మట సిద్దిరాములు శుక్రవారం రోజు యస్.సి,యస్.టి, కమిషన్ చైర్మన్ బక్కి వేంకటయ్య కు ఫిర్యాదు చేస్తు వినతి పత్రాన్ని ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది.









