అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు
___ చింతకాని తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
సిపిఎం చింతకాని మండల కమిటీ ఆధ్వర్యంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగని ఆదుకోవాలని రైతులకు నష్టపరిహారం అందించాలని తాసిల్దార్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించడం జరిగింది . ఈ ధర్నాను ఉద్దేశించి మొదటి డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన రోజు నుండి అధిక వర్షాభావం వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని పెసర పంట చేతికి రాకుండా నేలపాలు అయింది పత్తి ఎకరాకు రెండు మూడు క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చేసింది వరి ఎండు తెగులు వచ్చి పంట దెబ్బతిన్నది దిగుబడి వచ్చే అవకాశం లేదు రైతులు మరోపక్క అరకురా దిగుబడులతో వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేదు రైతులు అప్పుల పాలై ఉన్నారు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఉన్నదని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ నష్టపోయిన రైతులకు ఎకరాకు 30000 రూపాయలు నష్టపరిహారం అందించాలా రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించి బీమా డబ్బులు చెల్లించాలి రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రైతుల గురించి పంట నష్టం గురించి ఎక్కడ మాట్లాడలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నని పట్టించుకోకపోతే వాళ్ళ బాధల్లో వాళ్ళ కష్టాల్లో ప్రభుత్వం పాలుపంచుకోపోతే ఈ ప్రభుత్వానికి మనుగడ ఉండదు అని.ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన రైతాంగని ఆదుకొని నష్టపరిహారాన్ని రైతులకు ఇవ్వకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి రైతాంగం తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రాచబంటి రాము.మండల నాయకులు వత్సవాయి జానకి రాములు. నాన్నకి కృష్ణమూర్తి.కాటబత్తిన వీరబాబు. కొత్తపల్లి వెంకటేశ్వర్లు. మడిపల్లి కిరణ్. బాబు పులి యజ్ఞ నారాయణ. గడ్డం కోటేశ్వరరావు. ఆళ్ల మాధవరావు.నున్న రామకోటయ్య. ఖందరమైన కొండలు రావు. రౌతు అప్పారావు. నక్కన పైన శాంతారావు. మరియు తదితరులు పాల్గొన్నారు.









