రేగా కాంతారావు పిలుపు, మెచ్చా నాగేశ్వరావు ఆదేశాల మేరకు అశ్వారావుపేటలో నిరసన; ప్రజలకు ఇబ్బందులు తొలగించాలంటూ విజ్ఞప్తి
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని గుంతలు పడిన రోడ్లపై వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు పిలుపు మేరకు, అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఆదేశానుసారం ఈ నిరసన జరిగింది. బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై గుంతలను చూపుతూ, తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రోడ్లపై గుంతల కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, నాణ్యమైన రోడ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్, అశ్వారావుపేట నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి వగ్గెల పూజ, అశ్వారావుపేట టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ, మాజీ ఎంపీపీ శ్రీరామ్మూర్తి, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, సీనియర్ నాయకులు మందపాటి మోహనరెడ్డి, బజారయ్య, తాళ్ళ సూరి, జుజ్జరపు శ్రీరామ్మూర్తి, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, మాజీ సర్పంచ్, సాధు జోత్స్న, ధర్మ, హుసేన్, నక్క రాంబాబు, రహిమూన్, యువజన నాయకులు మోహన్, చరణ్, అమీర్, రఘురామ్, సురేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









