హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ నేటి గదర్ ప్రతినిధి అక్టోబర్ 27.
సోమవారం రోజున పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలువ మేరకు చలో హైదరాబాద్ నవంబరు ఒకటో తేదీన దళితుల ఆత్మగౌరవ నిరసన మహా ప్రదర్శన విజయవంతం చేయడంకోసం మెదక్ టీఎన్జీవో భవనంలో ఎమ్మార్పీఎస్, మాల మాహానాడు, దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకుల మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఎం. ఆర్. పి. యస్, నాయకులు మెదక్ జిల్లా ఇన్చార్జి బొజ్జ సైదులు, మాలల హక్కుల వ్యవస్థాపకులు బొమ్మల మైసయ్య, మరియు అనుబంధ సంఘాలు నాయకులు మాట్లాడుతూ
ఈ సందర్బంగా మెదక్ జిల్లా కార్యనిర్వాక అధ్యక్షులు హస్తరగల్ల బాలరాజ్, డీపీఎఫ్ జిల్లా కార్యదర్శి దయాసాగర్, మల్లేశం, పెంటయ్య, పోచయ్య, వీహెచ్పీఎస్ స్వరూప, మీడియా తో మాట్లాడుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డా గావాయ్ పైన దాడి ని ఖండిస్తూన్నామని
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బియర్ మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని అందుకోసం సుప్రీంకోర్టు ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ చేయించాలని, దళిత అనుబంధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.దళితుడైన బిఆర్గవై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రావడం కొన్ని ఆధిపత్య శక్తుల జీర్ణం తినక పోతున్నాయని అందుకే అహంపూరితంగా ఈ దాడికి తెగబడ్డారని,కావున ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని అలాగే దాడి వెనక ఉన్న శక్తులను గుర్తించి వారికి శిక్షలు పడేలా ఈ ఘటన మీద సమగ్రమైన దర్యాప్తుడు జరిపించాలని వచ్చేనెల 1వ తేదీన దళితుల ఆత్మగౌర మహా నిరసన ప్రదర్శన సమావేశం సందర్భంగా చేపడుతున్నామని అన్నారు . అందుకోసం సుప్రీంకోర్టు అనుభవం కలిగిన ప్రజాస్వామిక దృక్పథం కలిగిన విద్యార్థిలను దర్యాప్తు కోసం నియమించాలని అలాగే ఎలాంటి గడ్డలను ఉన్నత న్యాయవ్యవస్థలో పొనరావడం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఈ డిమాండ్లు తక్షణమే పరిగణ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దళిత భాగస్వామ్య ఇతర సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటన మళ్లీ పునరావస్తం జరగకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని అక్టోబర్ 7 న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గావాయ్ బెంచ్ మీద లాయర్లు వాదనలు వెళ్తున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి విసిరి దాడికి పాల్పడ్డారని చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని అన్న గరికమైందని ఈ దాడి ప్రజాస్వామిక స్ఫూర్తి రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నదని ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసిందని దళిత పీడత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదన గురి చేసిందని
అందువల్ల దేశ దళిత ప్రజలందరూ ఈ దాడిని ఖండించాలని ముఖ్య అతిథి బొజ్జ సైదులు మెదక్ జిల్లా ఇన్చార్జి తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఎమ్మార్పీఎస్ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.









