నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
* గ్రామస్తుల యోగ క్షేమాలు తెలుసుకుని.. పాఠశాల భవనం పరిశీలన
* సాదర స్వాగతం పలికిన.. సొంతూరు ప్రజలు
* అండగా ఉంటానని అభయమిచ్చిన రామ సహాయం
కూసుమంచి: తన స్వగ్రామమైన చేగొమ్మకు వెళ్లి.. గ్రామ పెద్దలు, వృద్ధులను పలకరించి..ఊరి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని.. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి నేనున్నానంటూ భరోసా నింపారు. సొంతూరి పర్యటనకు వచ్చిన ఎంపీకి గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. ” పెద్దాయన ఎలా ఉన్నావ్..? ఆరోగ్యం బాగుంటుందా..?” అంటూ పెద్దలతో మాట్లాడి, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. తొలుత కాంగ్రెస్ నాయకులు బొలికొండ శ్రీను తండ్రి బొలికొండ వెంకన్న ఇటీవల చనిపోగా.. వారి నివాసానికి వెళ్లి వెంకన్న చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చిన తమ భవనం పరిశీలన.
చేగొమ్మ గ్రామంలో.. దశాబ్దాల కిందట ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్వగృహాన్ని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పరిశీలించారు. తరగతి గదులను, నిరుపయోగంగా ఉన్న పై అంతస్తును పరిశీలించి.. అవసరమైన మరమ్మతులు చేయిస్తానని అభయమిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషన్ రావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు కొండపర్తి సురేష్, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









