+91 95819 05907

యువజన ఉద్యమాల సారథి డివైఎఫ్ఐ. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్

.

నవంబర్ 1 నుంచి 7 వరకు డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలి÷ డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్….

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

యువజనలు ఎదుర్కొంటున్న సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ, దేశభక్తి ఎదురై దేశభక్తి కలిగిన సంఘంగా, దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘంగా,యువజన ఉద్యమాల రథసారథిగా డివైఎఫ్ఐ ఉంది అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ అన్నారు…
స్థానిక సుందరయ్య భవనంలో డివైఎఫ్ఐ నాయకులు భూక్య ప్రసాద్ అధ్యక్షుడు జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోటా రమేష్ మాట్లాడుతూ దేశంలో యువత పెడదారి పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ అమలు చేయకుండా యువతను మోసం చేస్తున్నాయని, దేశంలో యువ శక్తి నిర్వీర్యం అయిపోతుందని, ఇలాంటి సందర్భంలో యువతను సక్రమమైన మార్గంలో నడిపేందుకు డివైఎఫ్ఐ నడుంబించిందని ఆయన అన్నారు. ఏర్పడిన తర్వాత ఈ దేశం కోసం సంఘం కోసం అనేక మంది డివైఎఫ్ఐ నాయకులు ప్రాణాలు అర్పించారని , వారి త్యాగాలతో డివైఎఫ్ఐ ఈరోజు దేశంలో అతిపెద్ద యోజన సంఘం గా ముందుకు పోతుందని ఆయన అన్నారు. ఈ దేశంలో యువజన సంఘాలను ముందు నడిపించే రథసారధిగా డివైఎఫ్ఐ ఉందని ఆయన సందర్భంగా గుర్తు చేశారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ 1980లో పంజాబ్ ముత్యానాలో నవంబర్ ఒకటి, రెండు,మూడు తారీకుల్లో ఏర్పడిందని అందుకే నవంబర్ 1 2 3 తారీకు లో రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆవిర్భావ కార్యక్రమాల ఘనంగా నిర్వహించాలని అని పిలుపునిచ్చారు. మా దేహం మొక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానీవని దేశ సమగ్రత, ఐక్యత కోసం పని చేసిన సంఘం డివైఎఫ్ఐ అన్నారు. దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన మరియు దేశంలో ఉన్న యువతకు సక్రమమైన మార్గంలో పెట్టడం కోసం డివైఎఫ్ఐ పనిచేస్తుందని ఆయన అన్నారు. దినోత్సవాలు గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు, జిల్లా నాయకులు షేక్ నాగుల్ పాషా, రావులపాటి నాగరాజు మెట్టెల సతీష్,మధు, కూచిపూడి నరేష్, సుందర్ రావు , వంకత్తుల ప్రతాప్, వినయ్, నాయకులు సైదులు, మాచర్ల రాజశేఖర్, గుడిపూడి అరవింద్, రాసాల నవీన్, ఎర్ర సాయి, వంశీ, తదితరులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !