న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న భార్య నిరసన
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి, 01/11/2025
ఎర్రుపాలెం మండలం రమన్నపాలెం గ్రామం తాళ్లూరి రాజారావు భార్య సువర్తమ్మ ను తన భర్త రాజారావు, ఆడబిడ్డలు, అల్లుళ్లు, బంధువులు వేధింపులతో రోడ్డు మీదకు తోసేస్తే ఇంటి ముందు నాకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న భార్య నిరసన
వివరాలు
ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామానికీ చెందిన తాళ్లూరి రాజారావు (55) మధిర మండలం తోర్లపాడు గ్రామానికి చెందిన సువార్తను (36) ఇరవై (25) సంవత్సరాల క్రితం మూడో సంబంధం గా ఇరు కుటుంబాల పెద్దమనుషుల సమక్షంలో వివాహం చేసుకొని, తీరా ఇప్పుడు నా మొదటి సంబంధం పిల్లల చదువులు పెళ్లిళ్లు, కాన్పులు పూర్తయింది. ఇప్పుడు భర్త రాజారావు నాకు వయసు అయిపోయింది నా శరీరం సహకరించట్లేదు నీతో నాకు శరీరకంగా అవసరం లేదు, నీ అవసరం నా నా పిల్లలకు, కుటుంబానికి, అవసరం లేదు నీ దారి నువ్వు చూసుకోవాలి అంటూ నా భర్త ఆడపడుచులు బంధువులు అవమానపరిచి రోడ్డు మీదకి నెట్టివేశారు. నాకు న్యాయం చేయాలని దీనంగా బతిమిలాడుకున్న వినకుండా అవమానపరిచరూ న్యాయం సమాజంలో నన్ను గౌరవంగా చూసే విధంగా నన్ను అవమానించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి…









