*న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, అమరుల త్యాగాలు వృధా కావని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు అన్నారు. శనివారం మండలం పరిధిలోని కాచనపల్లి గ్రామంలో అమరుల స్థూపం వద్ద అమరవీరుల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకటో తారీకు నుండి 9వ తారీకు వరకు అమరవీరుల వర్ధంతి సభలను గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. శనివారం ముత్తాపురం, మోదుగుల గూడెం, తూరుబాక ఎస్సీ కాలనీలో అమరవీరుల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామాన అమరవీరుల వర్ధంతి సభలను ప్రజలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సారంగపాణి, కిషన్, శేఖర్, లాజర్, చిరంజీవి, వీరన్న, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Post Views: 75









