జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు క్లబ్లో సినీ ప్రముఖులు, సినీ కార్మిక నాయకులతో సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ—
రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని తెలిపారు.
సినీ పరిశ్రమకు నాడు, నేడు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
చెన్నై నుంచి సినీ రంగాన్ని హైదరాబాద్కు రప్పించి, స్టూడియోలకు భూములు ఇచ్చి అభివృద్ధికి దోహదం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
ఫిలిం క్లబ్, చిత్రపురి కాలనీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వాల దూరదృష్టి ఫలితమని అన్నారు.
సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
హైదరాబాద్లో అన్ని భాషల వారూ కలసి ఎదుగుతున్నారని, భవిష్యత్తులో చిన్న, పెద్ద సినిమాలు మరింతగా రావాలని ఆకాంక్షించారు.
సినీ రంగం అభివృద్ధి చెందితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ఈ ప్రభుత్వం బలంగా ఉంటేనే సినీ పరిశ్రమ మరింత బలపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.









