నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిది,
సతీష్ కుమార్ జినుగు.
అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ఖమ్మం కు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పాలి. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా,రాజకీయంగా, ఆర్ధికంగా, అభివృద్ధి లో, భిన్న మతాల, కలయికతో ఎలాంటి అసంగటిత కార్యక్రమంలకు చోటు లేకుండా,రాష్ట్ర కాపిటల్ సిటీ హైదరాబాద్ కు పోటీగా అభివృద్ధిలో దూసుకుపోతుంది.అంతా బాగానే ఉన్నా… ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఉన్నా పేవిలియన్ గ్రౌండ్లో సాయంత్రం వెళ్లలో రిటైర్డ్ ఎంప్లాయిస్, చిరు ఉద్యోగులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు, ఆడా, మగ అనే తేడా లేకుండా ఇ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇదే పేవిలియన్ గ్రౌండ్ లో మినీ జిమ్ ని కూడా ప్రజల సౌకర్యర్ధం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతా బాగానే ఉన్నా… సాయంత్రం వెళ్లాలో ఒక్క సారిగా వాకింగ్ వచ్చే వారి సంఖ్య రోజు రోజు కు తగ్గి పోయింది. అసలే చలి కాలం,ఇ సమయంలో వాకింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరగాలి కానీ తగ్గుతున్నందుకు కారణం తెలుసుకోవాలని నేటి గదర్ డైలీ న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి, గత వారం రోజులుగా పర్యవేక్షించగా అసలు కారణం బయట పడింది. అదే సాయంత్రం వెళ్లాల్లో గ్రౌండ్ చుట్టూ వేలగాల్సిన లైట్స్ వెలగటం లేదని, ఉన్న అరకొర లైట్స్ కి చెట్ల కొమ్మలు అడ్డు రావటం,.. ఈ చీకటిని అడ్డు గా చూసుకొని కొందురు ప్రేమ జంటలు తమ తమ కార్యకలాపాలు చేసుకోవటం,వాకింగ్ చేసే వారికీ ఇబ్బంది గా ఉంటుంది.. అటు ప్రభుత్వ అధికారులు, కానీ, ఇటు ప్రజా ప్రతినిధులు కానీ ఇటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు. 40 సంవత్సరాల సుధీరగా రాజకీయ అనుభవం ఉన్న, అభివృద్ధి అంటే కేరఫ్ అడ్రెస్ గా ఉన్న తుమ్మల ఇలాకాలో ప్రజలు ఇలాంటి ఇబ్బందూలకు గురి కావటం ప్రజలను ఆశ్చర్యనికి గురి చేస్తుంది, ఖమ్మం జిల్లాలో, ముగ్గురు మంత్రులు, ఉండి, 4 గురు ఐఏఎస్ స్థాయి అధికారులు ఉండి కూడా ఖమ్మం పట్టణ ప్రధాన పరిసరాలలో ఇలాంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురి కావటం ఏమిటని ప్రజలు నేటి గదర్ న్యూస్, జిల్లా ప్రతినిధి కి తెలుపుతున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి, ఖమ్మం పేవిలియన్ గ్రౌండ్ లో ఉన్న సమస్య లకు, ముఖ్యంగా సాయంత్రం వెళ్లాలో లైట్స్, చెట్లు కొమ్మలు తీసేవేసి, ప్రేమ జంటలు రాకుండా చూస్తూ, వాకింగ్ చేసే ఆడవారి మనోభావాలును కూడా దృష్టిలో ఉంచుకొని అసంగటిత కార్యక్రమలు జరగకుండా,సమస్యలకు తొరగా స్పందిస్తారని ఖమ్మం ప్రజలు కోరుతున్నారు.









