+91 95819 05907

ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.

రబీ సీజన్ సన్న ధాన్యం బోనస్ 63 కోట్లు విడుదల చేయాలి

అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలి

సిసిఐ పత్తి కొనుగోలు నిబంధనలు ఎత్తివేయాలి

వరి, పత్తికి తేమ శాతం 20 శాతానికి పెంచాలి

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, ఖమ్మం జిల్లాలో రబీ సీజన్ సన్న ధాన్యం బోనస్ పెండింగ్ డబ్బులు 63 కోట్లు విడుదల చేయాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సమావేశం బొంతు సమత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అన్నారు. కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పత్తి కొనుగోలు నిబంధనలు రైతులకు నష్టం చేస్తాయని, సిసిఐ విధించిన కిసాన్ కపాస్ రిజిస్ట్రేషన్, తేమశాతం 8 నుంచి 12 శాతం ఉండాలి, ఎకరాకు ఏడు క్వింటాళ్ల కొనుగోలు నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలని కోరారు. వరి, పత్తికి తెమ శాతం 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు ఎడతెరిపిలేని అధిక వర్షాలు మూలంగా దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు పరిహారం చెల్లించాలని, క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని సర్వే చేసి ఎకరాకు రైతులకు 30‌ వేలు, కౌలు రైతులకు 50 వేలు నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, కమిటీ సభ్యులు గుడిమెట్ల రజిత, హరి వెంకటేశ్వరరావు, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, సంక్రాంతి నరసయ్య, అనుమోలు రామారావు, షేక్ నాగుల పాషా, తోట కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !