ప్రజా సంక్షేమంపై ఎమ్మెల్యే దృష్టి -భారీగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
గండుగులపల్లి, అశ్వారావుపేటలలో రూ. 16.46 లక్షల CMRF పంపిణీ – గురువారం నియోజకవర్గ పర్యటన
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 12: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో పాటు, విద్యార్థులకు సహాయక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎమ్మెల్యే పర్యటన ఉదయం 9:00 గంటలకు గండుగులపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ప్రారంభమవుతుంది. అక్కడ యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ను ఆయన పంపిణీ చేస్తారు. అనంతరం ఉదయం 10:00 గంటలకు గండుగులపల్లిలోని క్యాంపు కార్యాలయంలో దమ్మపేట మండలం లబ్ధిదారులకు రూ. 11,24,500/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారు. అదేవిధంగా, సాయంత్రం 4:00 గంటలకు అశ్వారావుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అశ్వారావుపేట మండలం లబ్ధిదారులకు రూ. 5,21,500/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ రెండు మండలాల్లో కలిపి మొత్తం రూ. 16,46,000/- విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాలకు మండల నాయకులు, అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, అన్ని పంచాయతీల గ్రామ శాఖ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు, ఇన్ఛార్జ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు పాల్గొనాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ వట్టి వెంకట్రావు కోరారు.









