వేదాంతపురంలో వన దుర్గంబికా సమేత లింగేశ్వర స్వామి ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
చైర్మన్గా గడ్డం వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్గా కూన చిన్నారావు; ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ హామీ.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వన దుర్గంబిక సమేత వన లింగేశ్వర స్వామి ఆలయ కమిటీని గ్రామ ప్రజల సమక్షంలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పెద్దలు మరియు భక్తుల ఏకగ్రీవ ఆమోదంతో నూతన కమిటీ ఛైర్మన్గా గడ్డం వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా కూన చిన్నారావు, కోశాధికారిగా దాది సోమరాజు బాధ్యతలు స్వీకరించారు. కార్యవర్గ సభ్యులుగా దాది వెంకటేశ్వరరావు, సంగీత సత్యనారాయణ, ఉప్పాడ హరి బ్రహ్మానందం, కూనదుర్గారావు, నడదీ లక్ష్మయ్య, గడ్డం రాముడు, పసుపులేటి నాగమణి, యలవర్తి శిరీష, దాది లక్ష్మి, కొయ్యల కమల, పైడిమంగ, దాది రాజేశ్వరి, గడ్డం వీరలక్ష్మిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ గడ్డం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేదాంతపురం గ్రామంలో పురాతన కాలం నుంచి ఉన్న శ్రీ వన దుర్గంబికా సమేత వన లింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడతానని హామీ ఇచ్చారు. కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో గ్రామ పెద్దకాపు తోట వెంకటస్వామి, మాజీ సర్పంచ్ సోమని శివ శంకర ప్రసాద్, పైడి లవర్ రాజుతో పాటు గ్రామ ప్రజలు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









