మద్దికొండ గ్రామంలో ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు
గిరిజన యోధుడు బిర్సా ముండా సేవలను కొనియాడిన అధికారులు, ప్రజా ప్రతినిధులు.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 15: భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అద్భుతమైన పాత్ర పోషించిన గొప్ప గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ శ్రీ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను అశ్వారావుపేట మండలంలోని మద్దికొండ గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జయంతి సందర్భంగా అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యదర్శి సమ్మయ్య మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం, అడవుల రక్షణ కోసం బ్రిటిష్ పాలకులపై పోరాడిన బిర్సా ముండా జీవితం అందరికీ ఆదర్శనీయం అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, యువత దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కూడా బిర్సా ముండా సేవలను స్మరించుకుని, ఆయన అందించిన సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వ









