బిర్సా ముండా స్పూర్తితో యువత ముందుకు సాగాలి.
*ఘనంగా బిర్సా ముండా 150వ,జయంతి వేడుక*
నేటి గదర్ కరకగూడెం: యువత బిర్సా ముండ స్ఫూర్తితో ముందుకు సాగాలని కరకగూడెం మండల ఆదివాసి సంఘాల ఐక్యవేదిక (జేఏసి)అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ అన్నారు. ఆదివాసి సంఘాల ఐక్యవేదిక (జేఏసి) ఆధ్వర్యంలో అమరుడు భగవాన్ బిర్సా ముండ 150 జయంతి వేడుకలను బట్టిపల్లి గ్రామంలోని కొమరం భీమ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పొలెబోయిన క్రిష్ణయ్య మాట్లాడుతూ చిన్ననాటి నుండి చదువుతోపాటు ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ అంచలంచెలుగా ఎదుగుతున్న సమయంలో ఆయనపై బ్రిటిష్ వాళ్లు జమీందారీ విధానాన్ని వ్యతిరేకంగా ఉల్గాన్ అనే పేరుతో అతని నినాదం అయినా రాణి రాజ్యం అంతమై మన రాజ్యం స్థాపించబడాలని బ్రిటిష్ వారు తిరగబడ్డారని ఆయన అన్నారు.ఆయన చేసిన ఎన్నో పోరాటాలకు గుర్తుగా రాంచీలో ఒక రైల్వే స్టేషన్ కు బిర్సా ముండ పేరు నామకరణం చేశారని అన్నారు. ఇలాంటి గొప్ప నాయకున్ని దేశంలో గుర్తించి ఆయన చిత్రపటాన్ని దేశ పార్లమెంట్లో ఉంచడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, కొమరం రాంగోపాల్,తుడుందెబ్బ అధ్యక్షులు పొలెబోయిన ప్రేమ్ కుమార్,కలం సంపత్,చందా రామక్రిష్ణ,పాయం.నరసింహరావు, ఊకే నరేష్,కలం వేణుగోపాల్,ఇర్ప.నాగకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









