కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది
సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి
*
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని ఇది ప్రజాస్వామ్యానికే మాయన మచ్చని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత అన్నారు. మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రాష్ట్ర నాయకులు సామినేని రామారావు కుటుంబ సభ్యులను కల్వకుంట్ల కవిత సోమవారం రాత్రి పాతర్లపాడులో పరామర్శించారు. రామారావు హత్య జరిగిన తీరును భార్య స్వరాజ్యం కుమారుడు విజయకుమార్ ని అడిగి ఆమె తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రామారావు గొప్పతనాన్ని పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవలను ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామినేని రామారావు చాలా మంచి మనిషి అని గ్రామస్తులందరూ చెబుతున్నారన్నారు. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ నాయకుల పట్టణ పెట్టుకున్నారని ఆరోపించారు. రామారావుని హత్య చేసి 17 రోజుల కడుస్తున్న నేటి వరకు నేరస్తులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. డిజిపి వెంటనే ఈ సమస్యపై స్పందించాలని డిమాండ్ చేశారు. రామారావు హత్యపై నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించాలని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కుటుంబానికి తాను రాష్ట్రస్థాయిలో కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులకు బెదిరించడం భయపెట్టడం అలవాటు అన్నారు. నేరస్తులకు శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి అండగా ఉండాలని అందులో భాగంగానే తాను హైదరాబాదు నుంచి రామారావు కుటుంబానికి అండగా ఉండేందుకు వచ్చానన్నారు. విప్లవాన్ని మోసే వీరులు మీరు, ఎర్రజెండా బిడ్డలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎర్రజెండా పేద ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. పేద ప్రజల కోసం పనిచేస్తున్న సామినేని రామారావుని హత్య చేయటం దారుణం అన్నారు. టిఆర్ఎస్ నాయకులు సామినేని అప్పారావు.సిపిఎం నాయకులు కాటబత్తిని వీరబాబు. సీనియర్ నాయకులు కొండ్రు జానకిరామయ్య. ఓబినబోయిన అచ్చయ్య. కొత్త పెళ్లి వెంకటేశ్వర్లు. మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









