జాగృతి జనంబాట – వైరా కూరగాయల మార్కెట్
రైతు సదస్సులో మాట్లాడిన కల్వకుంట్ల కవిత గారు
కవిత గారి కామెంట్స్
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు.
దీంతో ఇక్కడ అనేక అభివృద్ధి పనులు అయ్యాయని అనుకున్నా.
కానీ మా పర్యటనలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయి.
ఈ సమస్యల గురించి మనం అడగాల్సిందే.
జాగృతి జనం బాటలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి.
వైరాలో 2001 లో కేసీఆర్ గారు వచ్చినప్పుడు అంతా నవ్వారు.
కానీ ఇక్కడున్న జగదీష్ అన్న కేసీఆర్ గారికి అండగా ఉన్నారు.
వైరా లో మార్కెట్ సమస్య ఉందంటూ ఆయన నన్ను మాట్లాడమని కోరారు.
ఇక్కడ పాత మార్కెట్ ను కూలగొట్టి వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా.
నీటి పారుదల ప్రాజెక్ట్ లతో అదనంగా వైరాకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు.
ఇక్కడున్న ఇందిరమ్మ కాలనీ ముంపునకు గురి కాకుండా ఎమ్మెల్యే గారు చర్యలు చేపట్టాలి.
సుజల స్రవంతిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఒక్కటి కూడా పూర్తి చేయటం లేదు.
మహిళలకు రూ. 2500, పెన్షన్ పెంపు, ఫ్రీ కరెంట్ ఇలా ఏదీ చేయటం లేదు.
పైగా గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పథకాన్ని అమలు చేయటం లేదు.
వైరా ప్రజలు చైతన్య వంతులు. మీరంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి
మీకు అండగా మేము నిలబడుతాం. ఒక్కరోజు వచ్చి సమస్యపై మాట్లాడటం కాదు.
జాగృతి కమిటీలను బలోపేతం చేసి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతాం….









