హిడ్మా ఎన్కౌంటర్ ను ఖండించిన న్యూడెమోక్రసీ.
పోలీస్ అదుపులో ఉన్న మిగతా మావోయిస్టు నాయకులను తిరుపతి, దేవుజా లను కోర్టులో హాజరు పరచాలి.
తిరుమలయపాలెంలో నిరసన కార్యక్రమం చేస్తున్న న్యూడెమోక్రసీ నాయకులు.
సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
సిపిఐ మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ను బూటకమని,ఖండిస్తూ మిగతా నాయకులను తిరుపతి, దేవుజా లను మరికొంత మంది పట్టుకొని ఎక్కడ ఉంచారో ఆచూకి తెలిపి బెశరదుగా కోర్టులో హాజరు పరిచి వారికీ ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా ఉంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ అన్నారు.
తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ అడవిలో ఖనిజ సంపదను కార్పోరేట్ పెట్టుబడిదారులకు కనిజ సంపదను అప్పజెప్పటం కొరకు మోడీ, అమితాషా అడవులను జల్లెడ పడుతూ మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతోనే చంపుతున్నారని పడితే మావోయిస్టులను కీలకపాత్ర వహిస్తున్న అగ్ర నాయకులను తమ బిపిట్లో ఉంచుకొని ఆచూకీ చెప్పట్లేదని తక్షణమే వారికి ప్రాణహాని లేకుండా కోర్టులో హాజరు పరిచి ప్రజా కోర్టులో ప్రజల ముందు మీడియా సమావేశం ద్వారా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ జిల్లా నాయకులు పాముల మోహన్ రావు,సుబహాన్, డివిజన్ నాయకులు వీరస్వామి,నాగయ్య,పేరo వెంకటేశ్వర్లు,ఉమా శంకర్, షబ్బీర్,విజయ్,లక్ష్మణ్, రామదాసు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు









