హైదరాబాద్ జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో విద్య, నైపుణ్యాలు, ఉపాధి రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
జేఎన్టీయూ దేశాన్ని ముందుకు నడిపించే వేలాది ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, నాయకులను తీర్చిదిద్దిన జాతీయ ఆస్తిగా అభివర్ణించారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, అప్గ్రేడ్ చేయబడుతున్న ITIs, ఇండస్ట్రీ 4.0కు అనుగుణంగా రూపొందుతున్న నూతన శిక్షణ వ్యవస్థలతో రాష్ట్రం టెక్నికల్ ఎడ్యుకేషన్ను ఆధునికీకరిస్తున్నట్టు పేర్కొన్నారు.
జేఎన్టీయూ న్యాయమైన సమస్యలైన భూమి లీజ్, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ₹800 కోట్ల ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
ప్రస్తుత విద్యార్థులకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి పుస్తకాలు, ల్యాబ్లు, ఆవిష్కరణలకు దగ్గరగా ఉండాలని సూచించారు.
స్టార్టప్ల యుగంలో తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, భవిష్యత్తును ఎదురు చూసేవారికి కాకుండా అవకాశాలు సృష్టించే వారికి చెందుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.









