ఎర్రుపాలెం మండలం పెగళ్ళపాడు ఎస్సీ కాలనీ కి 1 కోటి 22 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం మండల ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు, 21/11/2025
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆర్థిక ,ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రివర్యులు అయిన శ్రీ భట్టి విక్రమార్క మల్లు కృషితో పెగళ్ళపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ లో 1 కోటి 22 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేసినారు. గత ఎన్నో దశాబ్దాల కాలంగా దళితవాడలు ఎంతో ఇబ్బందికరంగా, అధ్వానంగా రోడ్లు ఉండటంతో ప్రజాపాలనలో దళితవాడలకు ప్రత్యేక నిధులు కేటాయించినందుకు పెగళ్ళపాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాజీ సర్పంచ్ సగ్గుర్తి రాజేశ్వరి ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు.
Post Views: 54









