పార్లమెంట్ సభ్యులు రామసహాయంకు కృతజ్ఞతలు తెలిపిన స్థానిక రైతులు.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి చొరవతో చింతకాని మండలంలోనీ పాతర్లపాడు రైల్వే గేట్ ( ఎల్ సీ నంబర్ 112) నుంచి సీతంపేట ఎన్నెస్పీ మేజర్ కాల్వ వరకు.. 900 మీటర్ల మేరకు సీసీ రోడ్డును రైల్వే శాఖ పూర్తి చేసింది. నాగులవంచ, పాతర్లపాడు గ్రామాల రైతులు కాజీపేట- విజయవాడ మూడో రైల్వే లైన్ కోసం తమ వ్యవసాయ భూములు ఇచ్చారని, ఈ లైన్ తర్వాత వారి పంట పొలాలకు వెళ్లేందుకు సరైన దారి లేక ఇబ్బంది పడుతున్నారని ఎంపీ రఘురామిరెడ్డి గతంలో రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లారు. సిసి రోడ్డు నిర్మించాల్సిందిగా సూచించారు. దీంతో స్పందించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ వాస్తవ రైల్వే శాఖ నిధులతో మూసేసిన రైల్వే గేట్ నుంచి సీతంపేట ఎన్ఎస్పి మేజర్ కాల్వ వరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు.ఎంపీ రఘురాం రెడ్డి ప్రత్యేక చొరవ చూపిరోడ్డు సౌకర్యం కల్పించడం పట్ల స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిలారి మనోహర్ బాబు, కన్నెబోయిన సీతారామయ్య ,రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య ,ఎల్లంపల్లి సతీష్,
అడపా వెంకట రామ నరసయ్య , టీడీపీ నాయకులు తేలుకుంట్ల శ్రీనివాసరావు, రైతులు, స్థానికులు నెల్లూరి రమేష్, అమరబోయిన బసవయ్య, కొల్లా సైదులు, తోట వెంకటరావు, మోరంపూడి బాబు, వేటుకూరి నాగేశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూఎంపీ రఘురాం రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.









