బ్రేకింగ్ న్యూస్
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జీవో(46) విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు 50% మించకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో
వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచులకు 2011 సెన్సస్ ఆధారంగా( బీసీ సర్పంచ్ అభ్యర్థులకు 2024 కుల సర్వే) రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం
● హైదరాబాద్, నవంబర్ 22: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు మొత్తం 50 శాతం మించకుండా అమలు చేయాలని స్పష్టం చేస్తూ శనివారం ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది.
● జీవోలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేసే విధానాన్ని స్పష్టంగా వివరించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాల్లో రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొంది.
● మహిళలకు 50% రిజర్వేషన్
మహిళలకు అన్ని కేటగిరీల్లో — ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ — 50 శాతం వరకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
● 2019 రిజర్వేషన్ రొటేషన్కు ప్రాధాన్యం
గత పంచాయతీ ఎన్నికల్లో (2019) ఏ కేటగిరీలకు రిజర్వేషన్లు కేటాయించారో, ఆ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుని తాజా రొటేషన్ ప్రకారం కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలని జీవోలో పేర్కొంది.
● సర్పంచ్ – వార్డ్ మెంబర్ల రిజర్వేషన్ ఆధారాలు
వార్డు సభ్యులు: 2024 కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లు
సర్పంచ్లు:
●సాధారణ రిజర్వేషన్ కోసం 2011 జనగణన ఆధారంగా
బీసీ సర్పంచ్ పోస్టులకు 2024 కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్ అమలు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ జీవో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.









