ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కక ఆదేశాల మేరకు
నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి :
చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో 18 ఏండ్లు దాటిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.ఈ సందర్భంగా మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ &మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. స్వర్గీయ మాజీ ప్రధానీ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది మహిళలకు చీరల పంపిణీ ప్రారంభించినట్టు తెలిపారు.ప్రజా ప్రభుత్వం రాకతో మహిళల అభివృద్ధికి 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు.
RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం, బస్ లకు యజమానులు ను చెయడం మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఇవ్వడం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అని, ఆడబిడ్డ ఆర్థికంగా బలపడితే కుటుంబాల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని అన్నారు.
కుల గణన సర్వే సందర్భంగా ఆధార్ నంబర్ల ఆధారంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఆడబిడ్డకు చీరలు అందజేస్తునట్లు తెలిపారు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో. మత్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బందెల నాగార్జున, చింతకాని మండల మహిళా కాంగ్రెస్ పార్టీఅధ్యక్షురాలు తోటకూరి ప్రగతి,కాంగ్రెస్ నాయకులు తోటకూరి హరీష్, మండేపూడి కిషన్ రావు, తాళ్లూరి రమేష్, మధిర సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ వేర్పుల, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మెట్టెల కృష్ణ, బీసీ సెల్ నాయకులు వజ్రాల వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు అరువురి వెంకటేశ్వర్లు,గ్రామ దీపిక కాశీమల గీత, గ్రామ పెద్దలు,మహిళాలు తదితరులు పాల్గొన్నారు









