మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయం….. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లో నిర్వహించిన కొణిజేటి రోశయ్య వర్దంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పాల్గొన్నారు. కొణిజెటి రోశయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక, రవాణ, గృహ నిర్మాణం, వాణిజ్య పన్నుల, విద్య, వైద్య శాఖ మంత్రిగా సేవలు అందించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొంత కాలం సేవలు అందించారని, అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసారని తెలిపారు. మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఇ ఎం. వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమ శాఖ డిడి విజయలక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్ ఏవో కారుమంచి శ్రీనివాసరావు, తహసిల్దార్ లు, ఎఫ్ఆర్ఓలు, తదితరులు పాల్గొన్నారు.









