+91 95819 05907

కూటమి అభ్యర్థుల గెలుపు….. వైరా అభివృద్ధికి మలుపు

కూటమి అభ్యర్థుల గెలుపు….. వైరా అభివృద్ధికి మలుపు

వైరా మున్సిపాలిటీలో కూటమి జెండాను ఎగురవేయాలి

సిపిఐ(ఎం) బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులను గెలిపించండి

సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు.

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మున్సిపాలిటీలో ఎన్నికల్లో సిపిఐ(ఎం), బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులను గెలిపించి వైరా మున్సిపాలిటీపై కూటమి జెండాను ఎగుర వేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ(ఎం) సభ్యుల జనరల్ బాడీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థుల పరిపాలనలో వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారైందని అన్నారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతీపైన మున్సిపాలిటీ ప్రజల సమస్యల పరిష్కారానికి సిపిఐ(ఎం) పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని గుర్తుచేశారు. వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు. 57 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో నూటికి 56 శాతం మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగానికి కేవలం ఒక లక్ష 86 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, ఎరువుల సబ్సిడీ 20 వేల కోట్లు తగ్గించారని అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల, ఎరువుల సబ్సిడీ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, దీనివలన వ్యవసాయ రంగ అభివృద్ధి 4.4 శాతం నుంచి 3.6 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల గెలుపు వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రధాన మలుపు అవుతుందని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఐ(ఎం), టిఆర్ఎస్ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ, పేదల నివాస సమస్యలు వంటి ప్రజా సమస్యలపై సీపీఎం అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే సీపీఎం, బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. అనంతరం మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న పార్టీ
అభ్యర్థులకు బీ ఫారాలను వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, మెరుగు రమణ, కొండబోయిన నాగేశ్వరరావు, దుగ్గి కృష్ణ, బాణాల శ్రీనివాసరావు, దొంతబోయిన నాగేశ్వరావు, కె.నరేంద్ర, చెరుకుమల్లి కుటుంబ రావు, మచ్చా మణి, బీఆర్ఎస్ బలపర్చిన సిపిఐ(ఎం) 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాదినేని రజిని, 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుడిమెట్ల రజిత, 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కిన్నెర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

క్షతగాత్రున్ని కాపాడిన మాజీ ఎమ్మెల్యే రేగా ★ రేగా మానవత్వం పై అభినందనల వెల్లువ

*మనసున్న మహారాజు మాజీ ఎమ్మెల్యే రేగా* *మరో మారు మానవత్వం చాటుకున్న రేగ కాంతారావు* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మనసున్న మహారాజు రేగ కాంతారావు అని మరో మారు నిరూపించుకున్నారు కొత్తగూడెం నుండి

Read More »

వైరా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..మాజీ మంత్రి పువ్వాడ

నేటి గదర్, ఖమ్మం: బిఆర్ఎస్,సిపిఎం,సిపిఐ అభ్యర్థులను గెలిపించండి.. ఖమ్మం ఇంచార్జుల మరియు పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులకు పలు సూచనలు చేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. వైరా మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్

Read More »

మృత్యు రహదారి★ ఆదమరిస్తే అనంత లోకాలకి ★ ఆర్ అండ్ బి అధికారులు దృష్టి సారించాలి అంటున్న వాహనదారులు

*మృత్యు మార్గము* *ఆదమరిస్తే అనంత లోకాలకి* *ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు* *నేటి గదర్ న్యూస్ గుండాల*,గుండాల నుండి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారి సాయనపల్లి గ్రామ సమీపంలో రహదారి

Read More »

ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం పెరిగేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం పెరిగేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్,వైరా: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మెరుగుపర్చి, రీడింగ్ స్కిల్స్

Read More »

యువ నేత యుగంధర్ కు బర్త్ డే శుభాకాంక్షలు.

యువ నేత యుగంధర్ కు బర్త్ డే శుభాకాంక్షలు. షాది ఖానా డైరెక్టర్ షేక్. ఖదీర్ ( చైర్మన్ ) నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత ,

Read More »

గేటు రేలకాయల పల్లిలో నేటి నుంచి మినీ జాతర ప్రారంభోత్సవం

*2 రోజుల పాటు సాగనున్న వన జాతర పూజా కార్యక్రమాల*… కారేపల్లి నేటి గద్దర్ ప్రతినిధి సుమంత్: గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ దేవతలు కొలువుతీరిన మినీ జాతర కారేపల్లి మండలం గేటు

Read More »

 Don't Miss this News !