నేటి గదర్ న్యూస్,ఖమ్మం టౌన్ , ఫిబ్రవరి 4 :
భారతీయ జనతా పార్టీ ఖమ్మం 1 టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ పత్రికా ప్రముఖులతోమాట్లాడుతూ,తెలంగాణ లో ప్రస్తుతం జరుగబోయే మునిసిపల్ ఎలక్షన్ లో ఖమ్మం జిల్లా లో ఉన్న 5 మున్సిపాలిటీలల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీ బలపరిచిన వార్డు మెంబెర్లను పోటీలో ఉంచడం జరిగిందన్నారు. నిన్నటితో B ఫామ్ ప్రక్రియ కూడా పూర్తికావడంతో. ప్రతీ మున్సిపాలిటీ లో రాష్ట్ర స్థాయి నాయకుల పర్యవేక్షణ లో నేటి నుండి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు సారథ్యంలో మొదటి సారిగా జరుగబోయే ఈ ఎలక్షన్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సేవ – సుపరిపాలన లక్ష్యoతొ అభివృద్ధి పధకాలను కింద స్థాయి వరకు తీసుకెళ్లి మున్సిపాలిటీ లను కూడా బాగుచేసుకునే దిశగా నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేసి, ఓటర్లు ప్రసన్నం చేసుకొని ,వార్డు కౌన్సిలర్లను గెలిపించుకుంటామని తెలియచేసారు . ఇటీవల జరిగిన గ్రామ సర్పంచ్ ఎక్కడ కూడా ఓటర్లను ప్రలోబ పెట్టకుండా , కేవలం పోటీలో మాత్రమే వార్డు మెంబెర్లను గెలుచుకున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణా లో , ఖమ్మం జిల్లా నందు కూడా బీజేపీ జెండా గ్రామస్థాయి వరకు వెళ్లిందని రాబోయేరోజుల్లో ఖమ్మం నగరం లోకూడా ప్రజలకి బీజేపీ జెండా పైన నరేంద్ర మోదీ పైన అభిమానం పెరుగుతుంది అనటం లో సందేహం లేదన్నారు.ప్రస్తుతం యువత ఎక్కువగా బీజేపీ వైపే చూస్తున్నారని రాబోయేది యువతరం అని అత్యధికశాతం ఓటు వేసేవిధంగా ఓటర్లను అభ్యర్తన చేసుకుంటామని చివరాకరువరకు కూడా పోరాటం చేసి గెలుపే లక్ష్యం తొ ముందుకెళతామని తెలిపారు









