+91 95819 05907

వంట గ్యాస్ ధరల పెరుగుదల పేద ప్రజలకు భారం సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి

వంట గ్యాస్ ధరల పెరుగుదల పేద ప్రజలకు భారం

సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి

నేటి గదర్ న్యూస్, వైరా :
వంట గ్యాస్ ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి ప్రజలకు భారం అని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలు తగ్గించాలని ఆదివారం సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రింగ్ రోడ్డు సెంటర్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం పార్టీ వైరా పట్టణ కన్వీనర్ సుంకర సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలు ఒకేసారి గ్యాస్ మొద్దుకు 65 రూపాయలు, కమర్షియల్ మొద్దుకు 115 రూపాయల చొప్పున పెంచడం వలన పేద మధ్యతరగతి ప్రజలకు భారం అవుతుందని అన్నారు. ప్రజలపై భారం పడకుండా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యురాలు మెరుగు రమణ, డివిజన్ నాయకులు తోట నాగేశ్వరావు, పట్టణ నాయకులు బొంతు సమత, కొంగర సుధాకర్, హరి వెంకటేశ్వరావు, కామినేని రవి, తోట కృష్ణవేణి, మల్లెంపాటి రామారావు, గండగలపాడు మున్సిపాలిటీ కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, యనమద్ది రామకృష్ణ, కంసాని మల్లికాంబ, భూక్యా విజయ, అమరనేని కృష్ణ, ఇమ్మడి సుధీర్, చావా కళావతి బందెల అమృతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

 Don't Miss this News !