+91 95819 05907

దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో సి ఎస్ శాంతి కుమారి

.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ మే 28:

తెలంగాణ దశాబ్ది వేడుకలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జూన్ 2న ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.గన్‌పార్క్‌ అమర వీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించి,పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ గీతాన్ని ఆవిష్కరిస్తారు.
ఈ వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరేడ్ గ్రౌండ్‌లో రిహార్సల్స్‌ను వీక్షించారు.రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అనంతరం డీజీపీ రవిగుప్తాతో పాటు సీఎస్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పోలీసు కవాతు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున వేదికను సిద్ధం చేస్తున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కార్యకర్తలను సన్మానించనున్నారు.వేడుకల కోసం పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు పరేడ్ గ్రౌండ్ లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి.ముఖ్యంగా కళ్లు చెదిరే పోలీసు కవాతు కోసం భద్రతా బలగాలు వారాల తరబడి రిహార్సల్స్ చేస్తున్నాయని తెలిపారు.ఇందులో విద్యార్థులతో పాటు ఆక్టోపస్ బలగాలు,టీఎస్‌ఎస్పీ బెటాలియన్, ఏఆర్,కార్ హెడ్ క్వార్టర్స్ పోలీసులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !