◆ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి)మెదక్:
సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో ఆర్టీసీ, విద్య,
డి ఆర్ డి ఓ, ఆరోగ్య, పంచాయతీ, వ్యవసాయ, పౌరసరఫర, అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలో వివిధ శాఖల పనితీరును శాఖల వారిగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతు ఆర్టీసీలో ప్రయాణికుల సౌకర్యాలను, బస్సు డిపోలలో పరిశుభ్ర కార్యక్రమాలను , ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతమంది మహిళలకు లబ్ధి చేకూరిందో అడిగి తెలుసుకున్నారు. డిఆర్డిఓ అధికారులను మహిళలకు స్వయం సహాయక గ్రూపులకు అందించే సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. విద్యాశాఖ పై మాట్లాడుతూ జిల్లాలో పాఠశాల పున: ప్రారంభం తర్వాత విద్యార్థుల హాజరు మధ్యాహ్న భోజనము పుస్తకాల పంపిణీ ఏకరూపదస్తుల పంపిణీ వాటి వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశాఖ పై జిల్లాలో డెంగ్యూ, మలేరియా వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. పంచాయతీ శాఖపై గ్రామస్థాయిలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు, త్రాగునీరు కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖను జిల్లాలో వ్యవసాయ స్థితిగతులు , వర్ష ప్రభావం, రైతు భరోసా, ఎరువులు, విత్తనాలు, విద్యుత్తు ఇలాంటి వివరాలను తెలుసుకున్నారు. పౌర శాఖ అధికారులను రేషన్ బియ్యం, గ్యాస్ సరఫరాల పై ఆరా తీశారు. అటవీ శాఖ అధికారులతో జిల్లాలో నాటే మొక్కల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాసరావు విద్యాశాఖ అధికారి రాధా కిషన్, వ్యవసాయ అధికారి గోవిందు, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, అటవీ అధికారి రవికుమార్, పంచాయతి అధికారి యాదయ్య, ఆర్టీసీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









