+91 95819 05907

సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,

★ద్విచక్ర వాహనలకు నెంబర్ ప్లేట్స్ లేకుంటే వాహనాలు సీజ్ చేస్తాం

★గంజాయి మత్తు పదార్థాలు అమ్మే వారిపై కఠిన చర్యలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 15:- మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో రామాయంపేట సిఐ.వెంకట రాజా గౌడ్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉంటే సైబర్ నేరాలను అరికట్ట వచ్చన్నారు. ఆన్లైన్లో మీకు డబ్బులు వచ్చాయి చూసుకోండి మీ అకౌంట్ కు సీక్రెట్ ఓటిపి నెంబర్ వచ్చింది చెప్పండి అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త దారిలో దోచుకుంటున్నారని తెలిపారు. అకౌంట్లో డబ్బులు పడతాయి అన్న ఆశకు పోకుండా ఆ నెంబర్లను లిఫ్ట్ చేయొద్దని పేర్కొన్నారు.ఆన్లైన్ లో బెట్టింగ్లు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత పెడతోవా పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.మట్కా మారకద్రవ్యాలు గంజాయి లాంటి పదార్థాలు ఎవరైనా ఎక్కడైనా అమ్ముతుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ను తప్పక పాటించాలన్నారు లేకుంటే ప్రాణాలు గాలిలో కలిసి పోతాయన్నారు.హెల్మెట్ ధరించడం త్రిబుల్ రైడింగ్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఇలాంటి ప్రయాణాలు చేయొద్దని ఇలా చేయడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. అతివేగంతో నడిపే వారికే కాకుండా అన్నం పుణ్యం ఎరుగని బాటసారి కూడా బలైతారని అతివేగంగా వాహనాలు నడపొద్దని తెలిపారు.రామాయంపేట మండలంలో నంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాలు ఎవరైనా నడిపినట్లు అయితే అవి వెంటనే సీజ్ చేస్తామని తెలిపారు.ద్విచక్ర వాహనాలు నడిపే యువకులు 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే వాహనాలు నడపాలని లేనియెడల తల్లిదండ్రులు యువతకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు.ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సి కలిగి తప్పకుండా హెల్మెట్ ధరించాలని లేనియెడల జరిమానా విధించడం జరుగుతుందన్నారు.ఇలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !