+91 95819 05907

‘జైలర్’ ఫేమ్ నెల్సన్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ పుష్ప: ది రూల్’. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ రూ. 400కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటోంది. డిసెంబర్ 6న ఈ మూవీ విడుదల కానుంది.

అయితే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారనే చర్చ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జరుగుతోంది. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కొత్త సినిమాలకు అల్లు అర్జున్ ఆల్రెడీ కమిట్ అయినప్పటికీ ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉంది. ఈలోగా మరో దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయాలని అనుకుంటున్నారట. దీంతో ఆయన తర్వాతి సినిమా దర్శకుల జాబితాలో అట్లీ, బోయపాటి శీను, సురేందర్ రెడ్డి వంటి పేర్లు వినిపించాయి.

రజనీకాంత్ తో ‘జైలర్’ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ తెరకెక్కనుందనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో నెల్సన్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నెల్సన్ చెప్పిన స్టోరీ అల్లు అర్జున్ కు నచ్చిందని సమాచారం. పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేయాలని డైరెక్టర్ కు బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ కథకు తుది మెరుగులుదిద్దే పనిలో నెల్సన్ ఉన్నారట. అనుకున్నట్లు జరిగితే అల్లు అర్జున్, నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో మరో హిట్ ఉంటుందని టాక్. ఈ ఏడాది చివరిలోగా అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆదివాసి యువత విద్య ,క్రీడల పై మక్కువ పెంచుకోవాలి :గుండాల సీఐ ఎల్ రవీందర్

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండలంలోని ఆదివాసి యువత విద్య క్రీడలపై మక్కువ పెంచుకొని రానించాలని గుండాల సీఐ ఎల్ రవీందర్ సూచించారు. బుధవారం మండలం పరిధిలోని అడవిరామారం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్

Read More »

ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి… వైరా ఎమ్మెల్యే

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది

Read More »

మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు చెల్లించాలి :CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి… 17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల

Read More »

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ చిరుమల్ల కి రాక.

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ నిర్మల్ జిల్లా మామిడి మండలానికి చెందిన రచ్చ కోట పంద్రం జాలిష్ మహారాజ్ స్వామీజీ, దేవనగరం సమ్మక్క గద్దెల పూజారి తోలెం నాగయ్య

Read More »

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు

Read More »

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి నాయకులు సన్నాహక సమావేశం

రామాయంపేట (నేటి దగ్గర ప్రతినిధి) ఫిబ్రవరి 12:-మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి

Read More »

 Don't Miss this News !