+91 95819 05907

‘జైలర్’ ఫేమ్ నెల్సన్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ పుష్ప: ది రూల్’. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ రూ. 400కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటోంది. డిసెంబర్ 6న ఈ మూవీ విడుదల కానుంది.

అయితే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారనే చర్చ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జరుగుతోంది. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కొత్త సినిమాలకు అల్లు అర్జున్ ఆల్రెడీ కమిట్ అయినప్పటికీ ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉంది. ఈలోగా మరో దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయాలని అనుకుంటున్నారట. దీంతో ఆయన తర్వాతి సినిమా దర్శకుల జాబితాలో అట్లీ, బోయపాటి శీను, సురేందర్ రెడ్డి వంటి పేర్లు వినిపించాయి.

రజనీకాంత్ తో ‘జైలర్’ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ తెరకెక్కనుందనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో నెల్సన్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నెల్సన్ చెప్పిన స్టోరీ అల్లు అర్జున్ కు నచ్చిందని సమాచారం. పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేయాలని డైరెక్టర్ కు బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ కథకు తుది మెరుగులుదిద్దే పనిలో నెల్సన్ ఉన్నారట. అనుకున్నట్లు జరిగితే అల్లు అర్జున్, నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో మరో హిట్ ఉంటుందని టాక్. ఈ ఏడాది చివరిలోగా అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !