+91 95819 05907

జీపీలకు రూ.150 కోట్ల నిధులు విడుదల..!

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.150కోట్ల 57 లక్షల 59వేల 500 నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 32 జిల్లాల్లో పనిచేస్తున్న 29,676 మందికి దాదాపు ఆరు నుంచి ఏడు నెలలుగా జీతాలు అందడంలేదు. తాజాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అందరికీ ప్రయోజనం చేకూరనుంది.

ఈ నెల 12న బడ్జెట్ విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను మల్టీపర్పస్ కార్మికుల వేతనాలకు ఖర్చు చేయాలని తెలిపారు. ఈ మేరకు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ కింద జిల్లాలకు ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. జిల్లాల వారీగా కార్మికుల సంఖ్య, వారికి చెల్లించాల్సిన మొత్తంను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. పలు పోరాటాల తర్వాతే ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసిందంటూ..గతంలో చేసిన ఆందోళనలను చేశామని యూనియన్ నాయకులు తెలిపారు. వేతనాల సమస్యను పరిష్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పలు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం 9.30 గంటలకు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం కానున్నారు. ఈ సమీక్షలో మంత్రులు, సీఎస్, డీజీపీ, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు.

ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజన్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, ఇతర భద్రతాపరమైన అంశాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం వంటి 9 అంశాలను ఎజెండాలో చేర్చారు. వీటిని ఇప్పటికే సంబంధిత శాఖలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశాయి. వీటిపై అంశాల వారీగా సీఎం చర్చించి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !