+91 95819 05907

రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల..

తెలంగాణలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్టు డేటాబేస్ ఆధారంగా అర్హులను గుర్తించనున్నారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

 

పంట రుణమాఫీ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే జమ అవుతుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ విడుదల చేస్తారు. ఎన్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్ఎంజీ, ఎల్ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు రైతు రుణమాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతులకు సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతే కాకుండా రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. మరిన్ని వివరాకు పోర్టల్ కూడా చూడొచ్చు. లేదా మండల సహాయ కేంద్రాను కూడా సంప్రదించవచ్చు.

పథకం అమలుకు ఏర్పాట్లు..

వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటి పోర్టల్ నిర్వహించనున్నారు. ఈ ఐటీ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం పేర్కొన్న మరికొన్ని విషయాలు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !